Brahmamudi : వచ్చి బుద్దిగా కాపురం చేసుకోమన్న అత్త.. షాక్ లో కోడలు!
on Oct 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -533 లో....రాజ్ ఇంటికి వస్తాడు. కావ్య ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానంటూ అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు అంటారు. అక్కడ నేనే ఉన్నాను కదా అని రాజ్ అంటాడు. ఇంకా కావాలనే రుద్రాణి రెచ్చగొడుతుంది. కావ్య తన పర్సనల్ గొడవని మనసులో పెట్టుకొని రివెంజ్ తీసుకుంది. తను మన కుటుంబానికి తీరని నమ్మకద్రోహం చేసిందని రాజ్ అంటాడు. రాజ్ గదిలోకి వెళ్లి కోపంగా పెళ్లి ఫోటో వేసిరేస్తాడు.
ఆ తర్వాత రాజ్ పెళ్లి ఫొటోని కావ్య బట్టలని అన్ని తీసుకొని వెళ్లి.. గేటు బయటపడేసి నిప్పుఅంటిస్తాడు. అందరు ఆపిన ఆగలేదు. అప్పుడే వర్షం వస్తుంది. చూసావా ఆడదానికి అన్యాయం జరుగతుంటే ప్రకృతి కూడా ఎలా తనకి సాయం చేస్తుందోనని అపర్ణ అంటుంది. రాజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. నిజంగానే కావ్యకి ప్రకృతి సాయం చేసిందంటవా అని రుద్రాణి అనగానే.. అంత లేదు హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదని రాహుల్ అంటాడు. మరొకవైపు కావ్య గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తుంటే కనకం వస్తుంది. తనకి జరిగింది మొత్తం చెప్పి కావ్య బాధపడుతుంది. మా మావయ్యగారు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సామంత్ దగ్గరికి అనామిక వస్తుంది. లాస్ట్ వరకు వచ్చి ఎందుకు ఇలా చేసావ్.. మనమే వెనక ఉండి ఇదంతా చేసున్నామని తెలిసేలా చేసావని సామంత్ అంటాడు. ఇప్పుడు ఏమైందని అనామిక అడుగగా.. ఇప్పుడు ఆ కావ్య డిజైన్స్ వెయ్యనందని సామంత్ టెన్షన్ పడుతుంటే.. సరే ఆ కావ్యతో ఎలా డిజైన్స్ వేయించాలో నాకు తెలుసంటూ సామంత్ ని కూల్ చేస్తుంది అనామిక.
ఆ తర్వాత ఇందిరాదేవి, స్వప్నని పిలిచి ఇక్కడ జరిగిందేదీ కావ్యకి చెప్పకు.. తన వస్తువులు అలా బయట ఉంటే బాగోలేదు వెళ్లి తీసుకొనిరా అని ఇందిరాదేవి చెప్తుంది. మరొక వైపు అనుకున్నది జరిగిందని రుద్రాణి హ్యాపీగా డ్రింక్ చేస్తుంటే.. అనామిక ఫోన్ చేసి ఇంట్లో సిచువేషన్ ఎలా ఉందంటూ అడిగి తెలుసుకుంటుంది. రుద్రాణి అనామిక మతో మాట్లాడుతుంటే స్వప్న విని.. నీ సంగతి చెప్తానని దుప్పటి కప్పి వెనకాల నుండి వచ్చి రుద్రాణిని కొడుతుంది. ఆ తర్వాత ఎవరు కొట్టారని రుద్రాణి అనుకుంటుంది. అప్పుడే రాహుల్ వస్తాడు.. రాహుల్ తో చెప్తుంటే స్వప్న వచ్చి ఏం తెలియనట్టు అడుగుతుంది.
తరువాయి భాగంలో అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని రాజ్ అడుగుతాడు. గుడికి వెళ్ళింది కావ్యని కలవడానికి అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత నేను ఏ తప్పు చెయ్యలేదు.. అది చెప్తే వినట్లేదని కావ్య అంటుంది. నువ్వేం చెప్పనవసరం లేదు.. వచ్చి బుద్దిగా కాపురం చేసుకోమని అపర్ణ అనగానే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read